అమరావతి : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఆరంభం సందర్భంగా ఏపీలోని ప్రముఖులు రాష్ట్రప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల రుచులను(ఉగాది పచ్చడి)లా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు.
ఉగాదితో రాష్ట్రంలో ప్రతి ఇంటాసిరిసంపదలు, ఆయురారోగ్యాలు, ఆనందాలు నిండి ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. రైతులకు మేలు కలగాలని, అన్ని వృత్తుల వారు ఆనందంగా ఉండాలని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కష్టాలు తొలగాలని, చేదు తొలగి తీపి మిగిలాలని కోరారు.
ఉగాది కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరుగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలపై ధరాఘాతాలు, పన్నుపోట్లు లేని పాలన అందించేలా పాలకుల మనుసు మార్చాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.