అమరావతి : కేంద్ర మాజీ మంత్రి, రెబెల్ స్టార్ కృష్ణం రాజు మృతిపట్ల ఏపీకి చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. నటుడిగా, రాజకీయ నేతగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని జగన్ పేర్కొన్నారు. విలక్షణ నటనతో కృష్ణంరాజు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని, నటుడిగానే కాకుండా కేంద్రమంత్రిగానూ సేవలందించారని ఆయన మరణం తీరని లోటని చంద్రబాబు అన్నారు. నటుడిగా, రాజకీయ నేతగా ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేశారని అచ్చెన్నా యుడు అన్నారు. కృష్ణంరాజు మృతితో తెలుగు సినీ పరిశ్రమ పెద్ద దిక్కు కోల్పోయిందని అన్నారు.