ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఏపీలో ఈ యేడాది వ్యవసాయ సీజన్ ముందుగానే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. గతేడాది కంటే వ్యవసాయ సీజన్ను ముందుగానే ప్రారంభించాలని, సాగుకు సరిపడా నీటిని నిల్వచేయాలని డిసైడ్ అయ్యారు.
ఈ విషయాన్ని ఏపీ జలవనరుల మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ధవళేశ్వరం వద్ద వున్న డెడ్ స్టోరేజీని వినియోగించుకోవాలని కూడా నిర్ణయించారు. జూన్ 10 నుంచి కృష్ణా డెల్టా, పులిచింతల నీటిని వినియోగించుకోవాలని, జూన్ 30 నుంచి రాయలసీమ ప్రాజెక్టుల నీటిని వినియోగించుకోవాలని నిర్ణయించారు. అయితే నీటి వినియోగానికి సంబంధించి మాత్రం రైతుకు ముందే ఓ సూచన చేయాలని కేబినెట్ నిర్ణయించింది.