అమరావతి: ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్-1955 సవరణలకు ఉద్దేశించిన బిల్లుతో పాటు మరికొన్ని బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం సాయంత్రం ఏపీ సీఎం జగన్ అధ్యక్షత న సచివాలయంలో క్యాబినేట్ సమావేశం జరిగింది. శాసన సభలో ప్రవేశ పెట్టాల్సిన ముసాయిదా బిల్లులపై మంత్రి వర్గం చర్చించింది. శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో మెరుగైన సదుపాయాల కల్పన కోసం టీటీడీకి అప్పగిస్తూ చట్ట సవరణ, ఏపీ మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్, బోర్డ్లో 8 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ నెల 29న విద్యాదీవెన కార్యక్రమం, కొత్త పరిశ్రమలకు కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కొప్పర్తిలో డిక్సన్ టెక్నాలజీస్కు 4 షెడ్ల కేటాయింపుతో పాటు ఇన్సెంటివ్లకు, డిక్సన్ ఏర్పాటు చేయనున్న మరో యూనిట్కు 10 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సినిమా రెగ్యులేషన్ యాక్ట్-1955 చట్టంలో సవరణలు , హైకోర్టులో మీడియేషన్ సెంటర్ అండ్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు, స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్లో 16 కొత్త పోస్టుల మంజూరుకు నిర్ణయం తీసుకున్నారు.
దేవాలయాల అభివృద్ధి, అర్చక సంక్షేమం కోసం కామన్ గుడ్ ఫండ్ ఏర్పాటు, అసైన్డ్ ల్యాండ్ చట్టం, ఏపీ పంచాయతీ రాజ్ యాక్ట్-1994లో సవరణలు, ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్-2021 బిల్లుకు కేబినెట్లో ఆమోదం తెలిపారు.