అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఆయన ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో.. హత్యలు చేసే కడప వాళ్లకు కూడా మోడీ ప్రభుత్వం ఎయిర్పోర్టు కట్టించిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయల సీమ వాళ్లంటే హత్యలు చేసే వాళ్లేనా అంటూ పలువురు నాయకులు సోము వీర్రాజుపై మండిపడ్డారు.
దీంతో.. సోము వీర్రాజు తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
రాయల సీమ వాసులకు క్షమాపణలు చెప్పారు. రాయలసీమ రతనాల సీమ ఈ పదం నా హృదయంలో పదిలం అన్న సోము వీర్రాజు.. ప్రభుత్వ తీరును విమర్శించే క్రమంలో సీమ ప్రజల మనుసులు గాయపడ్డాయని తెలిపారు.ఆ సందర్భంలో నేను వాడిన పదాలు వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. ఆ వ్యాఖ్యలపై రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని.. రాయలసీమ అభివృద్ధి విషయంలో అనేక వేదికలపై ప్రస్తావిస్తున్నానని సోము వీర్రాజు చెప్పారు.