అమరావతి: ఉద్యోగ సంఘాలను నిర్భందించడమంటే.. జగన్ తనను తాను నిర్భందించు కున్నట్లేనని ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు.ప్రభుత్వం వారిని నిర్భంధించే చర్యలు మానుకోవాలని అన్నారు.
ముందస్తు నోటీసులు ఇచ్చి అడ్డుకోవడం కరెక్ట్ కాదని, ప్రభుత్వం,ఉద్యోగుల మధ్య మాటల యుద్దం మంచిది కాదని ఆయన తెలిపారు.
ఈ ప్రభుత్వం వద్ద డబ్బు లేదు… అప్పుల కోసం తిప్పలు పడే పరిస్థితి..మూల ధనం పెంచుకోవడంపై జగన్ దృష్టి సారించాలని సోము వీర్రాజు సూచించారు. ఆదాయం పెంచుకునేందుకు ఈ ప్రభుత్వం వద్ద అజెండా లేదు. ఏపీలో బిజెపినే ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని ఆయన వెల్లడించారు.