అమరావతి : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. దాదాపు 18 రోజుల పాటు సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 7న ప్రారంభమైన సమావేశాల తొలిరోజున మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అకాల మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తు సమావేశాన్ని వాయిదా వేశారు. రెండో రోజు రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. బడ్జెట్ ప్రతులను చింపివేసి నిరసన తెలిపారు.
11వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కాగా రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలపై చర్చించాలని పట్టుబడుగూ వరుసగా శాసన సభ, మండలి సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. దీంతో అటు స్పీకర్, ఇటు మండలి చైర్మన్ టీడీపీ సభ్యులను సమావే శాల నుంచి బహిష్కరించారు. పాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల విషయంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సమావేశాల ముగింపునకు ఒకరోజు ముందుగా స్వల్ప కాలిక చర్చను కొనసాగించారు.
శాసన వ్యవస్థ లకు చట్టాలు చేసే అధికారం లేదని చేసిన వ్యాఖ్యలపై సభలో సీఎం, మంత్రులు పలువురు అసహనం వ్యక్తం చేశారు. చివరి రోజు ఇవాళ బడ్జెట్కు ఆమోదం తెలుపడంతో సమావేశాలను ముగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.