అమరావతి : వచ్చే నెల శాసనసభ వర్షకాల సమావేశాల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. సెప్టెంబర్ మూడో వారంలో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. సుమారు 10 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్లో మరో 15 రోజులు సమావేశాలు నిర్వహించాలని చూస్తున్నది. కరోనా వల్ల గతేడాది ఒక్కరోజే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి.