అమరావతి : ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల(Exams) షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక నెలరోజుల ముందుగానే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చిలోనే పరీక్షలు నిర్వహించనున్నామని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ( Minister Botsa Satyanarayana) గురువారం మీడియా సమావేశంలో పరీక్షల షెడ్యూల్ను వెల్లడించారు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మార్చి 31వ తేదీలోగా పరీక్షలు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మార్చి 1 నుంచి 20 వ తేదీ వరకు ఇంటర్ (Inter) పరీక్షలు, మార్చి 18 నుంచి పదో తరగతి (Tenth Exams) పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.
ఏపీలో 6 లక్షల మంది 10 వతరగతి విద్యార్థులు, 10 లక్షల మంది ఇంటర్ ప్రథమ, ద్వితీయ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని మంత్రి తెలిపారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 5 నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు.