శ్రీకాకుళం: జిల్లాలోని ఉమ్మిలాడలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. గ్రామంలో తాజాగా మరో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది. సంత బొమ్మాలి మండలంలోని ఉమ్మిలాడకు ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి ఓ వ్యక్తి వచ్చాడు. అతనికి పరీక్షలు చేయడగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు అతని ప్రైమరీ కాంటాక్ట్స్ 24 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఇద్దరికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. మరో వంద మంది నుంచి నమూనాలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. పాజిటివ్ వచ్చిన ముగ్గురిని హోమ్ ఐసోలేషన్లో ఉంచారు. కాగా, దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించామని తెలిపారు.