విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లోని పూడిమడక (Pudimadaka) సముద్రతీరంలో మరో రెండు మృతదేహాలు లభించాయి. నేవీ హెలికాప్టర్ సాయంతో మృతదేహాలను ఒడ్డుకు తరలించినట్లు అధికారులు చెప్పారు. మృతులను జగదీష్ (గోపాలపట్నం), గణేష్ (మునగపాక)గా గుర్తించారు. దీంతో ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలు లభించినట్లయింది. శుక్రవారం పుడిమడక సముద్రంలో ఏడుగురు విద్యార్థులు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. వారిలో ఒకరు క్షేమంగా బయటపడగా, గుడివాడ సూర్యకుమార్ మృతదేహం నిన్ననే లభించింది. మరో ముగ్గురి కోసం నేవి, నాలుగు బోట్ల ద్వారా గాలిపు చర్యలు కొనసాగుతున్నాయి.
పూడిమడక బీచ్కు 15 మంది విద్యార్థులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైనవారిలో జశ్వంత్ (నర్సీపట్నం), రామచందు (ఎలమంచి), సతీశ్ (గుంటూరు) ఉన్నారు. వీరంతా అనకాపల్లిలోని డీఐఈటీ ఇంజినీరింగ్ కాలేజీకి చెందినవారని తెలిపారు.