అమరావతి : ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరం కలిగిస్తున్నాయి. ఇటీవల నంద్యాల జిల్లాలో బీటెక్ విద్యార్థి లోన్యాప్ నిర్వాహకుల వల్ల ఆత్మహత్య చేసుకున్న ఘటనను మరవకముందే మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం కలిగించింది.
కడప జిల్లాకు చెందిన రెడ్డి ప్రసాద్నాయక్ ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలోని కంప్యూటర్ సైన్స్ మూడో ఏడాది వసతి గృహంలో ఉంటు చదువుకుంటున్నాడు. ఇవాళ హస్టల్ గది నుంచి బయటకు రాకపోవడంతో గమనించిన సహచరులు కిటికి నుంచి చూడగా విగతజీవిగా పడి ఉండడాన్ని గమ నించారు. కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హస్టల్ గదికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి మృతికి గల కారణాలపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మూడు రోజుల క్రితం లోన్యాప్ నిర్వాహకుల ఒత్తిళ్లకు నంద్యాల జిల్లాకు చెందిన వీరేంద్రనాథ్ అనే విద్యార్థి బెంగళూర్లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. లోన్యాప్ నిర్వాహకుల బెదిరింపులతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ట్రిపుల్ ఐటీలో రెండో సంవత్స రం చదువుతున్న విశిష్ట రోషిణి అనే విద్యార్థిని వసతిగృహంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.