అమరావతి : ఏలూరు జిల్లా చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా( MLA Elija ) కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఎమ్మెల్యేకు స్వాగతం తెలుపుతూ కాంగ్రెస్ కండువాను కప్పారు. రాబోయే ఎన్నికల్లో ఎలీజాకు అధికార వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ అవకాశం ఇవ్వకపోవడం, నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా కంభం విజయరాజు పేరును ప్రకటించడంతో గత కొంతకాలంగా ఆయన అసంతృప్తితో ఉన్నారు.
మరో వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA ) బీజేపీ గూటికి చేరుకున్న విషయం తెలిసిందే. తిరుపతి జిల్లా గూడురు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ (Varaprasad) ఢిల్లీలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ థావడే సమక్షంలో బీజేపీ(BJP)లో ఆదివారం చేరారు. సీఎం వైఎస్ జగన్ వరప్రసాద్కు మరోసారి టికెట్ నిరాకరించడంతో ఆయన పార్టీ మారారు. గతంలో వరప్రసాద్ 2014 తిరుపతి వైసీపీ ఎంపీగా, 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.