Tirumala | తిరుమలలో మరో చిరుత చిక్కింది. అలిపిరి కాలిబాట మార్గంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో బుధవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది.
వారం రోజులుగా చిరుత సంచారంపై నిఘా పెట్టిన అధికారులు పలు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున చిరుత బోనులో పడింది. దీంతో ఇప్పటివరకు ఆరు చిరుతలను బంధించినట్లు అధికారులు వెల్లడించారు. చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే తాజాగా చిరుత దొరకడం గమనార్హం. పట్టుబడ్డ చిరుతను జూపార్క్కు తరలించేందుకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.