అమరావతి : కాకినాడ జిల్లాలో పులి సంచారం కలకలం సృష్టిస్తుంది. గత నెల రోజులుగా పులి సంచారం గ్రామస్థులకు, అటవి సిబ్బందికి కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. నిన్న జిల్లాలోని రౌతులపూడి మండలంలో పులి సంచారించినట్లు గ్రామస్తులు వెల్లడించడంతో అటవి అధికారులు, సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మేతకు వెళ్లిన ఆవుపై పులిదాడి చేయగా మరో ఆవు ఆచూకి కనిపించడం లేదని గ్రామస్థులు వాపోయారు.
అటవీ అధికారుల బృందం ఎస్.పైడిపాల, పెనుగొండ పరిసర ప్రాంతాల్లో పులి జాడ ఆనవాళ్ల కోసం అన్వేషిస్తున్నారు. బిళ్లలొద్ది, తోటమానిలొద్దిలో పులి అడుగు జాడలను సిబ్బంది పరిశీలిస్తున్నారు. అడవి మీదుగా అనకాపల్లి జిల్లా సరుగుడు, నర్సీపట్నం వైపు పులి వెళ్లే అవకాశం ఉందని అటవి సిబ్బంది భావిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు ప్రత్తిపాడుతో పాటు పరిసర గ్రామాల్లో బోన్లు ఏర్పాటుచేసినా అక్కడి నుంచి పులి తప్పించుకుంటుంది.