అమరావతి: కర్నూలు జిల్లా కోసిగిలో నాలుగురోజుల క్రితం నేరేడ్పండ్లు తిన్న ఘటనలో అస్వస్థతకు గురైన వారిలో మరో బాలుడు ఇవాళ చికిత్సపొందుతూ మృతి చెందాడు. పురుగుల మందుల కవర్లో నేరేడు పండ్లు తీసుకెళ్లి తినడంతో నలుగురు అస్వస్థతకు లోనయ్యారు. హర్ష అనే రెండేళ్ల బాలుడు అదేరోజు చనిపోగా మిగతా ముగ్గురిని అదోనిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు.
కాగా అంజి అనే మరో బాలుడు చికిత్సపొందుతూ మరణించాడు. మరో ఇద్దరు మహాదేవి, శ్రీరాములు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. నాలుగురోజుల వ్యవధిలో అన్నదమ్ముల మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.