Astrologer | కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం దొండవాకలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) మిస్సింగ్ కేసులో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 19 రోజులైనా అదృశ్యమైన చిన్నారి ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఏపీ పోలీసులు చిన్నారి కోసం బృందాలుగా గాలింపు కొనసాగిస్తున్నారు. కాగా ఇటీవలే తెలంగాణ నుంచి వచ్చినట్టు చెప్పుకున్న ఓ జ్యోతిష్యుడు పాప జ్ఞానేశ్వరి భూదేవిలో కలిసిపోయిందని, తాను పూజలు చేస్తే తిరిగి వస్తుందంటూ అర్థరాత్రి ఆ పాప ఇంటిపైకి ఎక్కి హల్ చల్ చేశాడని తెలిసిందే.
తాజాగా చిన్నారి ఇంటి వద్ద మరో జ్యోతిష్యుడు హల్ చల్ చేశాడు. చిన్నారిని తూర్పు దిశగా తీసుకెళ్లారని, జూలై, సెప్టెంబర్ నెలలోపు తిరిగి వస్తుందని జోష్యం చెప్పాడు. అంతేకాదు చిన్నారి ఇంటికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది, కొందరు ఆమెను తీసుకెళ్లారు.. ఆమెకు ఎలాంటి హానీ జరుగలేదు. పాప ఎక్కడున్నా సురక్షితంగానే ఉంది. ఆమె పక్కా దొరికేస్తదని కూడా నేను చెప్పగలను. నాకు ఆ శక్తి ఉంది. అమ్మాయి ఈ లొకేషన్లో ఉందంటూ సదరు జ్యోతిష్యుడు చెప్పడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
చిన్నారి జాను ఇంటి వద్ద ఇంకో జ్యోతిష్యుడు హల్చల్
చిన్నారిని తూర్పు దిశగా తీసుకెళ్లారని, జూలై, సెప్టెంబర్ నెలలోపు తిరిగి వస్తుందని జోతిష్యం
చిన్నారి ఇంటికి 100 కిలోమీటర్ల దూరంలో ఉందని, కొందరు తీసుకెళ్లినట్లు తెలిపిన జ్యోతిష్యుడు
కాగా చిన్నారి జాను అదృశ్యమై 19 రోజులైనా దొరకని… https://t.co/UGbXarjI3O pic.twitter.com/iIZg3MtKXP
— Telugu Scribe (@TeluguScribe) June 25, 2026