తిరుపతి: శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ట్రస్టుకు రూ.2 లక్షలు విరాళంగా అందింది. ఓ అజ్ఞాత భక్తుడు ఈ మొత్తాన్ని విరాళంగా అందజేశారు. ఈ విరాళం డిడిని తిరుపతికి చెందిన వై.రాఘవేంద్ర తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో సిఈవో జి.సురేష్కుమార్కు అందజేశారు.