తిరుపతి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 20 నుంచి 24వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా జరగనున్నాయి. కోవిడ్ మహమ్మారి నిబంధనల కారణంగా ఉత్సవమూర్తులను పుష్కరిణి వరకు ఊరేగింపుగా తీసుకొచ్చే అవకాశం లేనందున ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తారు.
ఈ 5 రోజుల పాటు ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు ఉత్సవమూర్తులకు తిరుమంజనం(అభిషేకం) చేపడతారు. జూన్ 20న శ్రీకృష్ణస్వామివారికి, జూన్ 21న శ్రీ సుందరరాజస్వామివారికి జూన్ 22 నుంచి 24వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తారు. తెప్పోత్సవాల కారణంగా ఈ 5 రోజుల పాటు కల్యాణోత్సవం రద్దైంది.