తిరుపతి : ఫిబ్రవరి 9వ తేదీ నుంచి టీటీడీ ఎంప్లాయిస్ కు యాన్యువల్ గేమ్స్ జరగనున్నాయి. తిరుపతిలోని పరిపాలనా భవనం వద్ద పరేడ్ మైదానంలో ఈ ఆటల పోటీలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 23వ తేదీ వరకు ఈ పోటీలు జరుగనున్నాయి. పురుషులకు, మహిళలకు వేరువేరుగా పోటీలు నిర్వహిస్తారు. ఇందులో టగ్ ఆఫ్ వార్, చెస్, వాలీబాల్, క్యారమ్స్, బాల్ బ్యాడ్మింటన్, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, షటిల్, టెన్నిస్ తదితర క్రీడలు ఉన్నాయి.