తిరుపతి: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 22 నుంచి మార్చి3వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
22-02-2022 ధ్వజారోహణం(మీనలగ్నం) హంస వాహనం
23-02-2022 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
24-02-2022 భూత వాహనం సింహ వాహనం
25-02-2022 మకర వాహనం శేష వాహనం
26-02-2022 తిరుచ్చి ఉత్సవం అధికారనంది వాహనం
27-02-2022 వ్యాఘ్ర వాహనం గజ వాహనం
28-02-2022 కల్పవృక్ష వాహనం అశ్వవాహనం
01-03-2022 రథోత్సవం(భోగితేరు) నందివాహనం
02-03-2022 పురుషామృగవాహనం కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం
03-03-2022 శ్రీనటరాజస్వామివారి రావణాసుర వాహనం,
సూర్యప్రభ వాహనం, త్రిశుల స్నానం. ధ్వజావరోహణం.
ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహిస్తారు.