Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా వార్షిక ఆరుద్రోత్సవ పూజలు నిర్వహించామని ఈవో ఎస్ లవన్న తెలిపారు. ధనుర్మాస ఆరుద్ర నక్షత్రంలో భాగంగా గురువారం రాత్రి పది గంటల నుండి గర్బాలయంలో మల్లన్నకు పంచామృతాభిషేకాలు, షోడశోపచార ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం, అన్నాభిషేకం జరిపించారు. వివిధ రకాల పుష్పాలు ఫలాలను నేవేద్యంగా సమర్పించారు.
వృద్ధ మల్లికార్జున స్వామికి బిల్వార్చన అభిషేక పూజలు చేశారు. శుక్రవారం తెల్లవారు జామున ప్రాత:కాల పూజల అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ముఖమండపంలో ఉత్తర ముఖంగా వేంచెంబు చేసి ప్రత్యేక పూజలు చేశారు.
అటుపై నందివాహనం పై ఆదిదంపతుల ఉత్సవ మూర్తులను ఆసీనులను గావించి గ్రామోత్సవం జరిపించారు.
గంగాధర మండపం నుండి నంది మండపం మీదుగా బయలు వీరభద్ర స్వామి వరకు సాగిన గ్రామోత్సవంలో ఆద్యంతం భక్తులకు కనువిందు జేసింది. నందివాహవాధీశులైన దేవదేవురులు భక్తులను కటాక్షించారు.