అమరావతి : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 19న పోలవరం ప్రాజెక్టును సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సోమవారం ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్లో ఆయన బయల్దేరి 11 గంటలకు పోలవరానికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా వెళ్లి కాపర్ డ్యామ్, తదితర (Sluice gates/ copper dam) ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అనంతరం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు పోలవరం సమావేశ మందిరానికి చేరుకుని ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట 10 నిమిషాలకు అక్కడి నుంచి బయల్దేరి తన క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.