Road accident: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగింది. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో మంత్రి విజయవాడ నుంచి మార్కాపురం వెళ్తుండగా ఎస్కార్ట్ వాహనం ఆటోను ఢీకొట్టింది.
దాంతో అందులో ఉన్న వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడిని త్రిపురాంతకం మనరాజుపాలెంకు చెందిన ఇజ్రాయెల్గా గుర్తించారు. ప్రమాదం సమయంలో మంత్రి సురేష్ మరో వాహనంలో ఉన్నారు.