మంగళగిరి: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నైపుణ్యాల స్థాయిని పెంచేందుకు ప్రపంచ బ్యాంకుతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 50 లక్షల మంది విద్యార్థులకు విద్యా నైపుణ్యాలు పెంచేందుకు రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు కూడా అంగీకరించింది.
ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు 250 మిలియన్ డాలర్ల రుణ సహాయం అందించనుంది. 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న వివిధ తరగతుల విద్యార్థులకు సాయం అందించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఈ రుణ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెల 18న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల సమక్షంలో ఒప్పంద పత్రాలపై ఏపీ అధికారులు సంతకాలు చేశారు.