అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో కూరుకుపోనుందని, రాష్ట్రం శ్రీలంక దిశగా సాగుతోందని ఏపీ పీఏసీ చైర్మన్ పయ్యవుల కేశవ్ తెలిపారు. శ్రీలంక కంటే 4 రెట్లు అధికంగా ఏపీ అప్పులు చేసిందని దుయ్యబట్టారు. ఆర్బీఐ నివేదిక ఆధారంగానే కేంద్రం ప్రజెంటేషన్ ఇచ్చిందని, ఇందులో రాజకీయం లేదని స్పష్టం చేశారు. ఆర్బీఐ వెల్లడించిన నివేదికలో రాష్ట్రం అవలంభిస్తున్న 10 అంశాలపై ఏపీ అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లోతైన అధ్యయనం జరిపి తీరాలని సూచించారు. అంతా సక్రమమమని భావిస్తే ప్రత్యేక ఆడిట్కు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. చేస్తున్న అప్పులకు వైసీపీ ప్రభుత్వం ఎందుకు లెక్కలు చూపించడం లేదని తెలిపారు. పీఏసీ చైర్మన్గా అడిగిన వాటికి వివరాలు చెప్పడం లేదని మండిపడ్డారు. వ్యవస్థలను సక్రమంగా నడిపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు.