అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,205 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరో 281 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 10,119 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో 24 గంటల్లో 41,954 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ తర్వాత ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఇక ఏపీలో పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. తాజాగా టీడీపీ నేత వంగవీటి రాధాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆయన స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తనను ఇటీవల కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకుని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.