అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,570 కొవిడ్ కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. వైరస్ ప్రభావంతో కొత్తగా ఒకరు మృతి చెందారు. తాజాగా 699 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26,770 యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల్లో 30,022 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించడంతో 2,570 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది.
తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 21,06,280 కేసులు రికార్డవగా.. ఇందులో 20,65,000 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాతో 14,510 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 1,124, విశాఖపట్నంలో 1,028, గుంటూరులో 368, అనంతపూర్లో 347 కేసులు నమోదయ్యాయి.