తిరుమల: శ్రీవారి దర్శన టికెట్లను విక్రయించిన కాణిపాకం సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరుణ అనే ఉద్యోగిని సుపథం టికెట్లను సేవా టికెట్లుగా విక్రయించింది . కాణిపాకం ఏఈవో మాధవరెడ్డి సిఫార్సు లేఖతో 12 టికెట్లు పొందగా వాటిని కాణిపాకం దేవస్థానంలో గ్యాస్ టెక్నిషియన్గా పనిచేస్తున్న కరుణ కర్నాటకకు చెందిన భక్తులకు రూ. 32 వేలకు విక్రయించింది. దీంతో కర్నాటక భక్తులు టీటీడీ విజిలెన్స్కు ఫిర్యాదు చేయడంతో నిందితురాలిపై కేసు నమోదు చేశామని తిరుమల ఏఎస్పీ మునిరామయ్య వెల్లడించారు. కాణిపాకం ఏఈవో మాధవరెడ్డిని కూడా ఈ కేసులో ప్రశ్నిస్తున్నామని ఆయన వెల్లడించారు.