నియోజకవర్గంలోని 108మంది లబ్ధిదారులకు పంపిణీ
ఎమ్మెల్యే చల్లా ఆదేశాలతో బాధితులకు అందజేసినస్థానిక ప్రజాప్రతినిధులు
పరకాల, మే 12 : రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో బాధిత కుటుంబాల ఇంటి వద్దకే వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 108మంది లబ్ధిదారులకు రూ. 45లక్షల విలువైన చెక్కులను సోమవారం పంపి ణీ చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో బాధిత కుటుంబాల కు ఆసరా అవుతాయనే ఉద్దేశంతో ఇంటికి వెళ్లి చెక్కులు పంపిణీ చేశామన్నా రు. పరకాల మున్సిపాలిటీ పరిధిలో 19మందికి రూ.9,06,500, పరకాల మండలంలో 8మందికి రూ.2,28,500, నడికూడ మండలం లో 16మందికి 7,59,500, ఆత్మకూరు మండలంలో 9మందికి 4,72,000, దామెర మండలంలో 8మందికి రూ.3,44,500, గీసుకొండ మండలం లో 9మందికి రూ.2,17,000, సంగెం మండలంలో 25మందికి రూ.10,20,000, జీడబ్ల్యూఎంసీ విలీ న గ్రామాల్లో 9మందికి రూ.2,62,500 విలువైన చెక్కులను అందజేశాన్నారు. కాగా, ప్రజలు లాక్డౌన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలన్నారు. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. వైరస్పై ప్రజలు భయాందోళనలకు గురి కావొద్దని, ధైర్యంగా ఉండి జాగ్రత్తలతో మహమ్మారిని తరిమి కొట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు.