హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. విజయవాడలో ఉదయం 11 గంటలకు విద్యా శాఖ కమిషనర్ సురేశ్కుమార్ ఫలితాలు విడుదల చేయనున్నారు.
మార్చి 18 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో 6.23లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ప్రైవేటుగా 1.02లక్షల మంది పరీక్షలు రాశారు.