అమరావతి : ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై జరుగుతున్న ఆందోళనల ఫలితంగా ఏపీ ప్రభుత్వం కొంత మెట్టు దిగి వచ్చింది. విలీనంపై గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను సవరిస్తూ కొత్తగా నాలుగు ప్రతిపాదనలతో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులతో సహా, ఎయిడెడ్ విద్యాసంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను, స్టాఫ్ ను పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించాలని సూచించింది. విద్యాసంస్థల ఆస్థులు కాకుండా కేవలం మంజూరు అయిన ఉపాధ్యాయ పోస్టులను, స్టాఫ్ను ప్రభుత్వానికి అప్పగిస్తూ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలుగా కొనసాగించాలని పేర్కొంది.
ఈ రెండు ఆప్షన్లకు వ్యతిరేకంగా పూర్తిగా ప్రైవేట్ ఎయిడెడ్ విద్యా సంస్థలుగా కొనసాగించాలని ఉత్తర్వులో స్పష్టం చేసింది. ప్రభుత్వానికి విలీనంచేయడానికి అంగీకరించిన విద్యాసంస్థలకు పునరాలోచన కల్పిస్తూ విలీనంపై అంగీకారాన్ని వెనక్కి తీసుకుని పూర్తిగా ఎయిడెడ్ విద్యాసంస్థగా నడుపుకోవాలని పేర్కొన్నారు.