హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ రాజధాని కేసుపై జస్టిస్ సంజీవ్ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజధాని కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. దీనిపై విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్కు వాయిదా వేసింది. ఈలోపు అన్ని పక్షాలు తమ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.