అమరావతి: ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా ఉంటుందని హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కోర్టు కు కృతజ్ఞత తెలియజేసేందుకు పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికపూడి శ్రీనివాస్ ఇవాళ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. తుళ్లూరు నుంచి తిరుమల వరకు కొనసాగనున్న యాత్ర గతంలో రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్ర మార్గంలో కొనసాగనుంది. ముందుగా తుళ్లూరు శివాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీనివాస్ యాత్రను రాజధాని ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్ జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును గౌరవించాలి, ప్రభుత్వం ఇంకా మూడు రాజధానులని మాట్లాడటం సరికాదని పేర్కొన్కారు. కోర్టు ఆదేశాల మేరకు అమరావతిలో వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని కోరారు. ఇప్పటికైన ఏపీ సీఎం జగన్ మనసు మారాలని, హైకోర్టు తీర్పు ప్రకారం రాజధానిలో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.
బడ్జెట్ లో నిధుల కేటాయించకపోవడం దారుణం ఆయన అన్నారు. అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు వెలగపూడి రామకృష్ణ మాట్లాడుతూ..అమరా వతికే ప్రజల మద్దతు ఉందని, జగన్ మాత్రమే వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. రాజధాని నిర్మాణమైతే ఈ ప్రాంతవాసులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు.