AP Dy CM Narayana Swamy | వైసీపీని వీడుతున్న వారంతా టీడీపీ కోవర్టులేనని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారంతా ముందు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్లో ఉన్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని శనివారం మీడియాతో చెప్పారు. టీడీపీ నుంచి వచ్చిన వారిని తీసుకోవద్దని సీఎం వైఎస్ జగన్ను కోరినట్లు తెలిపారు. షర్మిల తన కొడుకు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి టీడీపీ అధినేత చంద్రబాబును కలవడంపై ఆమె విజ్ఞత కే వదిలేస్తున్నానని చెప్పారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్.. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై సమీక్షలు నిర్వహించి, అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇన్ చార్జీలను నియమిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఖరారు కాని వారంతా ప్రతిపక్ష టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.