AP Govt Schools get CBSE | వైఎస్ జగన్మోహనరెడ్డి సారధ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్ఈ గుర్తింపు పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. 2024 నుంచి విద్యార్థులంతా సీబీఎస్ఈలోనే పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యాశాఖపై సోమవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. ప్రతి పాఠశాలలోనే ప్లే గ్రౌండ్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్లే గ్రౌండ్ లేని స్కూళ్ల జాబితా రూపొందించాలన్నారు. అయితే, పాఠశాలల్లో ప్లే గ్రౌండ్స్ నిర్మాణానికి భూములు స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని సీఎం జగన్మోహన్ రెడ్డికి అధికారులు సూచించారు.