అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గత రెండున్నర సంవత్సరాలుగా అరాచక, దౌర్జన్య వైసీపీ పాలన కొనసాగుతుందని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు, గ్రామాల్లో వారి కార్యకర్తలు మహిళలపై దాడులకు పాల్పడుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తుమ్మలపాలెంలో టీడీపీకి చెందిన మహిళా సర్పంచ్ ఇంటిపై దాడి చేయడాన్ని ఆయన ఖండించారు.
హోంమంత్రి సొంత నియోజకవర్గంలో మహిళలపై దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మహిళా సర్పంచ్పై దాడికి పాల్పడ్డ నిందితులను వెంటనే అరెస్టుచేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.