అమరావతి : అత్యవసర సమయాల్లో విమానాలు దిగేందుకు వీలుగా జాయతీ రహదారిపై నిర్మించిన రన్వేపై గురువారం పలు విమానాలు సురక్షితంగా దిగాయి. ఈ మేరకు ఏపీలోని బాపట్ల జిల్లా రేణింగవరం-కొరిశపాడు మధ్య నాలుగు కిలోమీటర్ల రన్వేపై కార్గో, ఫైటర్ జెట్ విమానాలు ల్యాండింగ్ ట్రయల్ రన్ను విజయవంతం నిర్వహించారు.
ముఖ్యంగా 16వ నెంబర్ జాతీయ రహదారిపై అత్యవసర సమయాల్లో విమానాలు దిగేందుకు వీలుగా ఇప్పటికే ఏపీలోని రెండు ప్రాంతాల్లో రన్వేలు నిర్మించారు. వరదలు, భూకంపాలు, ప్రకృతి విపత్తులతో పాటు అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమానాలు సైతం క్షేమంగా నేలపైకి దిగడానికి వీలుగా రన్వేలను ఏర్పాటు చేశారు.
దేశవ్యాప్తంగా 19 చోట్ల అత్యవసర ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేయగా ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా సింగరాయకొండ-కలికివాయి, బాపట్ల జిల్లా రేణింగవరం-కొరిశపాడు మధ్య హైవే మీద రన్వేలు సిద్ధం చేస్తున్నారు. గురువారం రేణింగవరం-కొరిశపాడు మధ్య ఐదు విమానాల ను ట్రయల్రన్ను సంబంధిత అధికారులు నిర్వహించారు.