అమరావతి : ఏపీలో ఎన్నికల రోజున, ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై బాధ్యులతో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసు, ప్రభుత్వ అధికారులపై చర్యలను ముమ్మరం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి అల్లర్ల ఘటన ( Tadipatri riots incident ) లో స్పెషల్ బ్రాంచ్ సీఐ జాకీర్ హుస్సేన్ (CI Zakir Hussain ) ను విధుల నుంచి తొలగించారు. వెంటనే డీఐజీ (DIG) కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి .
ముఖ్యంగా తాడిపత్రిలో పోలింగ్ రోజు ఓం శాంతి నగర్లో జరిగిన రాళ్లదాడి జరిగింది. మరుసటి రోజు టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటిపై రాళ్లదాడి జరిగిన అనంతరం పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేకేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల దాడులపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. సిట్ దర్యాప్తు చేపట్టాలని ఆదేశించిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం బ్రిజ్లాల్ నాయకత్వంలో 13 మంది సభ్యుల బృందంతో సిట్ను ఏర్పాటు చేసింది. అల్లర్లు జరిగిన ప్రదేశాన్నిఈ బృందం పర్యటించి నివేదికను అందజేసింది.
హింస్మాతక ఘటనలకు పాల్పడ్డ నిందితులపై కేసులు విధించి అరెస్టు చేయగా మరికొందరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అల్లర్లపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సమాచారం ఇవ్వకపోవడంతో సీఐ జాకీర్ హుస్సేన్పై చర్యలు తీసుకుంటూ ఆదేశాలు వెలువడ్డాయి.