అమరావతి : విజయవాడ ఆస్పత్రిలో మహిళా కమిషన్ చైర్పర్సన్పై చేసిన అనుచిత ప్రవర్తనపై కమిషన్ ముందు హాజరు కావాలని పంపిన నోటీసులకు గైర్హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు, బొండా ఉమపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. బాధితురాలిని పరామర్శించడానికి వచ్చిన తనపై దాడులకు యత్నించడం దారుణమని అన్నారు.
పరామర్శ రోజున తనపై, బాధితురాలు చికిత్స నేపథ్యంలో టీడీపీ నేతలు వ్యవహరించాల్సిన తీరును ప్రదర్శించకుండా చేసిన నేరాలపై టీడీపీ నాయకులకు పలు ప్రశ్నలు సందించారు. బాధితురాలి పరిస్థితి పట్టించుకోకుండా ఆమె చికిత్స పొందుతున్న గదికి వచ్చి రచ్చ చేయడం, చంద్రబాబు, బొండా ఉమ తనపై బెదిరింపులు తదితర నేరాలకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. విచారణకు హాజరు కావాలని నోటీసులిస్తే కనీసం కమిషన్పై గౌరవం లేకుండా అహంకారంగా వ్యవహరించారని ఆమె పేర్కొన్నారు.
కమిషన్ సభ్యులంతా సమావేశంలో చర్చించి టీడీపీ నేతలిద్దరిపై చర్యలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మహిళా కమిషన్పై రాజకీయాలు అంటగట్టడం సరైనది కాదని ఆమె అన్నారు.