అమరావతి : కడప జిల్లా జిల్లా ప్రొద్దుటూరు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గత యేడాది ముగ్గురు కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ ప్రొద్దుటూరు రెండో అదనపు జిల్లా జడ్జి తీర్పునిచ్చారు. 2021 ఏప్రిల్ 26న ఇంట్లో నిద్రిస్తున్న తల్లి, తమ్ముడు, ఆరు నెలల గర్భిణి చెల్లెలును కరిముల్లా అనే వ్యక్తి రోకలిబండతో కొట్టి దారుణంగా హత్య చేశాడు.
తన భార్యతో విడాకులు ఇప్పించేందుకు సహకరించడం లేదని కక్ష పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేయగా కోర్టులో జరిగిన వాదనల అనంతరం ఇవాళ కోర్టు శిక్షను ఖరారు చేస్తు తీర్పునిచ్చింది.