పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ ఒక ఆర్టీసీ బస్సు వాగులో పడటంతో 8 మంది దుర్మరణం పాలయ్యారు. జంగారెడ్డి గూడెం, జిల్లేరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. వంతెన రెయిలింగ్ను బస్సు ఢీకొట్టడంతో అదుపు తప్పి వాగులో పడిపోయినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మిగతా ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. వేలేరుపాడు నుంచి జంగారెడ్డి గూడెం వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ బస్సులో 40 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలియజేశారు.
అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. మరణించిన 8 మందిలో ఐదుగురు మహిళలే ఉన్నారని చెప్పారు. పడవల సాయంతో బస్సులోని వాళ్లను స్థానికులు కాపాడి ఒడ్డుకు చేర్చారు.