అమరావతి : ఏపీలోని అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు (AC Raids) పంజా విసురుతున్నారు. బాధితుల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు స్పందిస్తున్న ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న అధికారులను రెడ్హ్యండెడ్గా పట్టుకుంటున్నారు.
బాధితుడు ఫిర్యాదు మేరకు మంగళవారం చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్పురం ఎమ్మార్వో కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. బాధితుడి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ తాసిల్దార్(MRO) షబ్బీర్, వీఆర్వో(VRO)గోవింద్ రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భూమికి సంబంధించిన కేసుల్లో ఇద్దరు అధికారులను పట్టుకుని వారిపై కేసు నమోదు చేశారు.