అమరావతి : ఏపీలోని రెండు జిల్లాలో ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB ) అధికారులకు రెడ్హ్యండెడ్గా పట్టు్బడ్డారు. వివరాలకు వెళితే.. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలో ఓ రైతు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం గ్రామీణ విద్యుత్ ఏఈ (AE) ప్రకాష్ నాయక్ను సంప్రదించాడు. దీంతో ఏఈ లంచం డిమాండ్ చేయగా రైతు ఏసీబీని ఆశ్రయించాడు. బుధవారం కార్యాలయంలో ఏఈ రూ. 55 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.
అదేవిధంగా నెల్లూరు(Nellore) జిల్లా కొండాపురం పోలీస్ స్టేషన్పై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బాధితుడి నుంచి అందిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసులో వ్యక్తి నుంచి రూ. 30 వేలు లంచం తీసుకున్న ఎస్ఐ ఖాజావలిని రెడ్హ్యండెడ్గా పట్టుకున్నారు.