Srisailam | దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఆంధ్రప్రదేశ్ భవన్, శ్రీశైలం దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఢిల్లీలో కన్నుల పండువగా శ్రీ స్వామి వారి అభిషేకం, శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ రెడ్డివారి చక్రపాణి రెడ్డి దంపతులు, ఈవో లవన్న దంపతులు పాల్గొన్నారు.
ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరూపాక్షయ్య, మేరాజోత్ హనుమంత్ నాయక్, ఓ మధుసూదన్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, దేవస్థానం పర్యవేక్షకులు కే వెంకటేశ్వరరావు, పలువురు అర్చక స్వాములు, వేద పండితులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
శ్రీ స్వామివారి అభిషేకం, శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవంలో ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల ప్రజలు హాజరయ్యారు. స్వామివారి అభిషేకం తర్వాత కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేశారు.