అమరావతి : రాష్ట్ర ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని టీడీపీ నాయకుడు బొండా ఉమ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ సీఎం అయ్యాక పోలవరం భవిష్యత్తు ప్రశ్నార్ధకమైందని ఆరోపించారు. వరదలు వస్తాయని తెలిసినా సర్కారు నిర్లక్ష్యమేమిటని నిలదీశారు. అవగాహన లేని మంత్రి వల్లే పోలవరం అధ్వానంగా ఉందని వ్యాఖ్యనించారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి పోలవరాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.