అమరావతి : ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. అనంతగిరి మండలం బూర్జ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు రాత్రి బొర్రా గుహల్లో శివరాత్రి వేడుకలు తిలకించారు. వీరు తిరిగి వస్తుండగా మండలంలోని లుంగుపర్తి వద్ద వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం ప్రమాదవాశాత్తు లోయలోకి దూసుకెళ్లింది.
దీంతో ముగ్గురు యువకులకు తీవ్రగాయాలై దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.