అమరావతి : ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila ) అధికార వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( CM YS Jagan) పాలనపై మండి పడ్డారు. వైఎస్ రాజశేఖర్ పాలనకు, జగన్ పాలనకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. తనపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలకు ధీటుగా సమాధానమిస్తూ ‘ పులి కడుపున పులే పుడుతుందని, నేను వైఎస్ఆర్ బిడ్డను’ అని అన్నారు.
శుక్రవారం కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పాలనకు, జగన్ పాలనకు చాలా తేడా ఉందని అన్నారు. వైఎస్సార్(YS Rajashekar Reddy) పాలనలో జలయజ్ఞానికి ప్రాధాన్యత చ్చి 17 శాతం నిధులిస్తే, జగన్ 2.5 శాతమే ఇచ్చారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కాదు కదా కనీసం ప్రత్యేక ప్యాకేజీ (Special Status) కూడా సాధించలేదని ఎద్దేవా చేశారు.
పోలవరం(Polavaram), ప్రత్యేక హోదా, రాజధాని ఏదీ లేదు. ఉన్నవన్నీ అప్పులేనని విమర్శించారు. రాష్ట్రంలో 25 మంది ఎంపీలున్నా రాష్ట్రానికి తెచ్చింది గుండుసున్నానేనని ఆరోపించారు. తన స్వలాభం కోసం జగన్ రాష్ట్రాన్నే తాకట్టు పెట్టారని వివరించారు. వైసీపీ నేతలు బీజేపీకి కట్టు బానిసలుగా మారారని పేర్కొన్నారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినవారిని పక్కన పెట్టుకున్నారని జగన్పై మండిపడ్డారు.