అమరావతి : కృష్ణా జిల్లా మంగళగిరి మండలం నువులూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ శ్వేత చౌదరి (22) ఆత్మహత్య చేసుకుంది . మూడు నెలల నుంచి వర్క్ప్రమ్ హోం ద్వారా విధులు నిర్వహిస్తున్న ఆమె ఆదివారం నుంచి హైదరాబాద్ సంస్థలో విధుల్లో చేరాల్సి ఉండగా నిన్న సాయంత్రం ఈ దారుణానికి పాల్పడింది. నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయలు దేరిన ఆమె తాను జగ్గయ్యపేట పరిధిలో చిల్లపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని రాత్రి 8 గంటలకు తల్లిదండ్రులకు వాట్సాప్ మెసేజ్ పంపింది.
దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ మృతదేహాన్ని బయటకు తీసి శవ పంచనామ నిమిత్తం మృతదేహాన్ని జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.