అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వడగండ్ల వానలు, పిడుగుపాట్లు, ఉరుములు, మెరుపులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పిడుగుపాటు (Lightning) కు గురై నంద్యాల జిల్లాలో గొర్రెల కాపరి శనివారం మృతి చెందాడు. జిల్లాలోని గడివేముల మండలం చిందుకూరు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి ( Shepherd ) శేఖర్ మేత కోసం గొర్రెలు, మేకలను తీసుకెళ్లి అటవిప్రాంతానికి వెళ్లాడు. వర్షం కారణంగా గొర్రెల కాపరి చెట్టు కిందకు రాగా ఒక్కసారిగా అతడిపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
సహచర గొర్రెల కాపారులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి శవ పంచనామా చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఇదే జిల్లాలోని గడిగరేవులలో పిడుగుపాటుకు 25 గొర్రెలు మృతి చెందాయి .